Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో విడుదలైన 'లోఫర్' చిత్రంతో దిశా పటానీ కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ అవకాశాలని దక్కించుకుంటూ కెరీర్ పరంగా రాణించే ప్రయత్నం చేస్తోంది. 'ఎంఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ', 'కుంగ్ ఫూ యోగా', 'బాఘి 2' వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ సరసన 'భారత్'లో నటిస్తున్న దిశా తాజాగా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. 'అషిఖీ 2' ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇందులో ఆదిత్య రారు కపూర్ హీరోగా నటించనున్నారు. థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ ఇద్దరు జోడీ కట్టబోతున్న తొలి చిత్రమిది. ఈ సినిమా కోసం ఇప్పటికే ముంబయిలో భారీ సెట్ని డిజైన్ చేశారట. త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమా మేజర్ షూటింగ్ గోవాలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'భారత్'లో కత్రినా కైఫ్ మెయిన్ లీడ్గా నటిస్తుండగా, సర్కస్ గర్ల్గా దిశా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది.న