Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా టిఎస్ సంతోష్ దర్శకత్వంలో బి మధు సమర్పణలో ఔరా సినిమాస్ పీవీటీ, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అర్జున్ సురవరం'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త పోస్టర్ని విడుదల చేశారు. 'ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిఖిల్ ఇందులో జర్నలిస్ట్గా నటిస్తున్నారు. జర్నలిస్ట్గా ఆయన ఏం చేశాడనేది సినిమాలో ఆసక్తికరం. త్వరలోనే చిత్ర టీజర్ని విడుదల చేయనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 29న సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని చిత్ర యూనిట్ చెప్పింది. వెన్నెల కిషోర్, పోసాని, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్యామ్ సిఎస్, కెమెరా: సూర్య, ఆర్ట్: సాహి సురేష్.