Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ తారల పెళ్ళికి సంబంధించిన వార్తలు రోజుకొకటి వినిపిస్తూ వాళ్ళ వాళ్ళ అభిమానులను ఖుషి చేస్తున్నాయి. వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని తమిళ నాయకానాయికలు ఆర్య, సాయేషా సైగల్ పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. వీరి బాటలోనే ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ జోడీ టైగర్ షరాఫ్, దిశా పటానీ సైతం పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నట్టు వారు తాజాగా దిగిన ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి. చేతి రింగ్కి ముద్దు పెడుతున్న ఓ ఫొటోని టైగర్ షరాఫ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. అంతేకాదు 'నేను అనుకున్నట్టు జరుగుతోంది' అని కూడా పేర్కొన్నారు. దీంతోపాటు దిశాపటానీ సైతం తన చూపుడు వేలికి అదే మాదిరి ఉన్న రింగ్కి ముద్దు పెడుతున్నట్టు ఉన్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 'ఎవరో అడిగారు, నేను ఎస్ చెప్పాను' అని దిశా ఇచ్చిన రిప్లైతో వీరికి ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి గతేడాది 'బాఘి2' చిత్రంలో నటించారు. అప్పట్నుంచి వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా రింగ్స్తో ఇద్దరూ ఫొటోలు షేర్ చేయడంతో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతూ, విశేష్ తెలియజేశారు. అయితే ఇదంతా పెప్సీ సంస్థ ప్రమోషన్ కోసం చేసిన ప్రకటన అని, దీన్ని చూసి అందరూ మా ఎంగేజ్మెంట్ అయిపోయిందని, త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని భావించారు అని దిశా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది.