Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనిక హీరోహీరోయిన్లుగా ఎస్.ఎం.ఎస్.ఖాజా దర్శకత్వంలో మజ్ను సోహ్రాబ్ మూవీస్ పతాకంపై మజ్ను రెహానా బేగం నిర్మిస్తున్న చిత్రం 'నైజాం పిల్లోడు'. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత రెహానా బేగం చెబుతూ, 'ఒక్క పాట మినహా టాకీ పార్ట్ పూర్తయ్యింది. సినిమాలోని పాటలను శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం. వాటికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం ద్వారా మజ్నుని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. తను మంచి బాణీలను అందించారు. రీరికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 29న సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'దాదాపు 45 చిత్రాల్లో సోలో ఫైటర్గా నటించిన బల్వాన్ ఇందులో హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. కామెడీ, హర్రర్, సస్పెన్స్ అంశాలన్ని ప్రేక్షకులను ఆకట్టు కునేలా, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దాం. ఆదరించాలనికోరుకుంటున్నాం' అని దర్శకుడు తెలిపారు. సంపత్రాజ్, ఫిరోజ్, దిల్ రమేష్, శివ సత్యనారాయణ, జ్యోతి, మేఘన, రాణి, దీపికా దేవి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి. న