Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు అత్యంత పాశవిశంగా చేసిన దారుణ దాడిని యావత్ భారతావనీతోపాటు సినీ లోకం సైతం ఖండించింది. అమర జవాన్ల త్యాగాలని గుర్తుపెట్టు కుంటామంటూ నివాళ్లర్పించింది. టాలీవుడ్ కథానాయకుడు విజరు దేవరకొండ ఓ అడుగు ముందుకేసి మృతి చెందిన జవాన్ల కుటుంబాలకి తన వంతు ఆర్థికసాయాన్ని 'భారత్ కే వీర్' రూపంలో అందించారు. 'వారు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకి మనం అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనవంతు సహకారం అందిద్దాం. నా వంతు సాయం అందించాను. మనమంతా కలిసి సాయం చేద్దాం' అని ట్విట్టర్లో విజరు దేవరకొండ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'భారత్ కే వీర్' నిధికి విరాళంగా ఇచ్చిన పత్రాన్ని విజరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజరుకి థ్యాంక్స్ చెబుతూ కేంద్ర హోంశాఖ నుంచి ఈ పత్రం వచ్చింది. ప్రస్తుతం విజరు దేవరకొండ 'డియర్ కామ్రేడ్'తోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.