Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చాలా రోజులుగా తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇకనైనా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను' అని అంటోంది రారు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రారు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, 'ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుగా ఉంటుంది. ఇందులో నేను వెంకటలక్ష్మిగా టైటిల్ రోల్ పోషిస్తున్నా. విలేజ్ నుంచి వచ్చి టీచర్గా వర్క్ చేస్తుంటాను. టైటిల్కి, కథకి కనెక్షన్ ఉంటుంది. ఓ అంశం కోసం వెతకడం సినిమా ప్రధానంగా సాగుతుంది. అదేంటనేది తెరపై చూడాల్సిందే. ఓ ప్రాపర్ కామెడీ సినిమాలో నేను నటించడం ఇదే మొదటిసారి. కథతోపాటు ఈ జోనర్ నచ్చి నటించా. పూరీ దగ్గర పనిచేయడంతో దర్శకుడు కిషోర్ సినిమాని చాలా ఫాస్ట్గా తెరకెక్కించాడు. ఇందులో 'పాపా..' అంటూ సాగే పాట నా ఫేవరేట్. అందరికీ నచ్చే పాట కూడా. టైప్ కాస్ట్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. అందుకే చాలా సెలక్టీవ్గా వెళ్తున్నా. తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నా. 'అధినాయకుడు' బ్రేక్ ఇస్తుందనుకున్నా. అది రాంగ్ టైమ్లో వచ్చింది. చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా 'ఖైదీ నంబర్ 150', పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో ప్రత్యేక పాటల్లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. 'రత్తాలు ..' పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడంతా నన్ను 'రత్తాలు' అని పిలుస్తున్నారు. ఇకపై ఈ చిత్రంలోని 'పాపా..' పాటతో అంతా 'పాపా..' అని పిలుస్తారనుకుంటా (నవ్వుతూ). ప్రత్యేక పాటల ట్రెండ్ మారింది. ఒకప్పుడు వాటిని ఐటమ్ సాంగ్స్ అనేవారు. ఇప్పుడు 'ఐటమ్ నెంబర్' అంటున్నారు. అయితే చాలా మంది మేకర్స్ ఈ పాటలను మిస్ లీడ్ చేస్తున్నారు. సాంగ్ ప్రయారిటీని బట్టి నెక్ట్స్ ప్రత్యేక పాటల గురించి ఆలోచిస్తాను. హిందీలో చేసిన 'జూలియా 2' సినిమా అమ్మాయిల కోసం తీశాం. టీజర్, ట్రైలర్స్ ఆడియెన్స్ని మిస్ లీడ్ చేశాయి. అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు మాత్రమే ఆ సినిమాకి వచ్చారు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, కన్నడలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో అంజలితో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది' అని తెలిపింది.