Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్నివ్వగా, నిర్మాత ఎన్.సుధాకర్రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మరో నిర్మాత శరత్ మరార్ స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ, 'ఫస్ట్ టైమ్ నేను ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నా. ఇందులో వినోదమే కాదు, ఓ ఆసక్తికర పాయింట్ కూడా ఉంటుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉండే చిత్రమిది' అని అన్నారు. 'మా బ్యానర్లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. సబ్జెక్ట్ చాలా బాగుంది. తప్పకుండా అందర్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. నేటి (మంగళవారం) నుంచి రెగ్యులర్ షూటింగ్ని నాన్స్టాప్గా జరుపనున్నాం' అని నిర్మాతలు తెలిపారు. కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్, కెమెరా: మిరోస్లా కుటా బ్రోజెక్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: రామ్కుమార్.