Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిలింద్ రౌ దర్శకత్వంలో కథానాయకుడు రానా ఓ సినిమా చేయనున్నారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, ''బాషా' చిత్రంతో తెలుగు సినిమా ఇండిస్టీకి విశ్వశాంతి పిక్చర్స్ ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో నయనతార సూపర్ హిట్ చిత్రం 'ఇమైక్కా నొడిగల్'ని 'అంజలి సిబిఐ' పేరుతో విడుదల చేస్తున్నాం. అలాగే పలు తెలుగు సినిమాలను మా బ్యానర్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా రానా దగ్గుబాటితో ఓ సినిమా చేయబోతున్నాం. 'బాహుబలి'లో భల్లాలదేవ'గా, 'ఘాజి'లో నేవీ అధికారి అర్జున్గా, 'నేనే రాజు నేనే మంత్రి'లో రాజకీయ నాయకుడిగా ..ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో తరహా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మా బ్యానర్లో సినిమాని యాక్సెప్ట్ చేసిన రానాకి ధన్యవాదాలు.
'గృహం' వంటి హర్రర్ థ్రిల్లర్ని రూపొందించిన దర్శకుడు మిలింద్ రౌ
ఈ సినిమాకి డైరెక్ట్ చేయబోతున్నారు. ఆగస్ట్ నుంచి సినిమాని ప్రారంభిస్తాం'
అని చెప్పారు.