Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ, ఉమయ హీరోహీరో యిన్లుగా సతీష్ బత్తుల దర్శ కత్వంలో సైన్స్ స్టూడియోస్ పతాకంపై మర్రి మేకల మల్లి ఖార్జున్ నిర్మిస్తున్న చిత్రం 'ఆకాశవాణి విశాఖ పట్టణ కేంద్రం'. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందు కూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, 'జబర్దస్త్లో రాణించిన సతీష్ బత్తుల దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రమిది. కథ చాలా బాగుంది. అందరిని మెప్పిస్తుంది. సినిమా విజయం సాధించి నిర్మాతకి డబ్బులు, మంచి పేరుని తీసుకురావాలి' అని అన్నారు. 'దర్శకుడిని అవ్వాలని ఇండిస్టీకి వచ్చా. ఇప్పటికి ఆ ఛాన్స్ వచ్చింది. డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్ ఇది. థ్రిల్లింగ్గా ఉంటుంది. నిర్మాత మల్లిఖార్జున్ లేకపోతే సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. రాజీపడకుండా నిర్మిస్తున్నారు. మంచి ఆర్టిస్టులతోపాటు కార్తీక్ మ్యూజిక్, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది' అని చిత్ర దర్శకుడు సతీష్ బత్తుల చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ, 'సతీష్ చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాని నిర్మించడంలో నా బాధ్యతని నిర్వర్తించాను. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నా' అని చెప్పారు.