Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో 'స్పైడర్' తర్వాత పూర్తి స్థాయి కథానాయికగా కనిపించలేదు. ఇటీవల 'ఎన్టీఆర్ - కథానాయకుడు'లో శ్రీదేవి పాత్రలో కాసేపు మెరిశారు. ప్రస్తుతం నాగార్జున సరసన తొలి సారి నటిస్తున్నారు. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న 'మన్మథుడు 2'లో ఓ కథానాయికగా ఎంపికైంది. ఇందులో ఆమె ఫ్రీ స్పిరిట్, అత్యంత తెలివైన అమ్మాయిగా కనిస్తారట. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని, రకుల్లోని మరో యాంగిల్ని ప్రతిబింబించే చిత్రమవుతుందని యూనిట్ చెబుతోంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. దీంతోపాటు రకుల్ బాలీవుడ్లో అజరు దేవగన్తో కలిసి 'దే దే ప్యార్ దే' చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ని చిత్ర బృందం ప్రకటించింది. మే 17న సమ్మర్ స్పెషల్గా విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే రకుల్ తమిళంలో సూర్య సరసన 'ఎన్జీకే'లో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. వీటితోపాటు
శివ కార్తీకేయన్ చిత్రంలో, హిందీలో 'మర్జావాన్'లో నటిస్తూ బిజీగా ఉంది.