Authorization
Mon Jan 19, 2015 06:51 pm
68 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్దొరల బానిసత్వంలో మగ్గిన భారతీయ ప్రజలు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నారు. ఇదొక చరిత్ర. ఇదొక స్ఫూర్తి.. ఇదొక రగిలే ప్రేరణ..ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే విజయం.. వీటికి ప్రతీకగా రూపొందిందిందే 'వందేమాతరం' జాతీయ గీతం. అనుక్షణం సూర్ఫినిచ్చే ఈ జాతీయ గీతాన్ని ఏ తెల్లదొరలైతే పాలన పేరుతో మృగాలుగా ప్రవర్తించారో.. అదే పాలకుల స్వస్థలం లండన్లో వేలాది మంది ఇంగ్లీషు జనం సమక్షంలో రెండు ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ఏ.ఆర్.రెహ్మాన్ తన ట్రూప్తో పాడనున్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లండన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహ్మాన్ జాతీయగీతాన్ని ఆలాపించనున్నారు. రెహ్మాన్తో పాటు నేపథ్యగాయనీ గాయకులు నీతి మోహన్, జావేద్ ఆలీ, కార్తీక్, హరిహరన్, జోనితా గాంధీ తదితరులు
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.