Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో సెలబ్రిటీల్లో దేశభక్తి ఉప్పొంగిపోతోంది. స్వాతంత్య్రోద్యమం, దేశరక్షణలో అమరులైన వారికి సామాజిక మీడియా ద్వారా సెల్యూట్ సెల్ఫీలతో ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సెల్యూట్ సెల్ఫీల ద్వారా వారి దేశభక్తిని చాటుకుంటున్నారు. అమితాబ్, షారూఖ్ఖాన్, రిషి కపూర్, షాహిద్కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సెల్యూట్ సెల్ఫీతో అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి బాటలోనే టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ ఖాతాలో సెల్యూట్ సెల్ఫీని పోస్ట్ చేసి అభిమానులు సైతం భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. వీరితోపాటు విశేష ఆదరణ పొందిన క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ తదితరులు సైతం సెల్యూట్ సెల్ఫీతో ఉప్పొంగుతున్న దేశభక్తిని చాటుతున్నారు. అంతేకాకుండా అభిమానులు సైతం ఈ సెల్యూట్ సెల్ఫీ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిస్తున్నారు.