Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిరత్నం సినిమాలో కథానాయికగా నటించే అవకాశం రావడం చాలా అరుదు. ఈ అవకాశం కోసం నాయికలంతా వేచి చూస్తుంటారు. వారిలో అనుష్క కూడా ఒకరు. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్ని సొంతం చేసుకున్నప్పటికీ అనుష్క ఇప్పటి వరకు మణిరత్నం సినిమాలో నటించలేదు. తాజాగా ఆ ఛాన్స్ని అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం హిస్టారికల్ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విక్రమ్, విజరు సేతుపతి, జయంరవి, ఐశ్వర్యరారు, కీర్తిసురేష్, నయనతార వంటి భారీ తారాగణం నటిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకుందట. ఆమె ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ల్లో నటిస్తుంది. 'సైరా', రజనీకాంత్ 'దర్బార్', విజరు- అట్లీల సినిమా, 'లవ్ యాక్షన్ డ్రామా' వంటి చిత్రాల షూటింగ్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థానంలో అనుష్కని ఎంపిక చేసే ఆలోచనలో మణిరత్నం ఉన్నారట. గతేడాది 'భాగమతి' తర్వాత అనుష్క మరే సినిమాలో నటించలేదు. ఏడాది గ్యాప్ తర్వాత థ్రిల్లర్ నేపథ్యంలో హేమంత్ మధుకర్ రూపొందిస్తున్న 'సైలెన్స్'లో అనుష్క నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, అనుష్క పెళ్ళికి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు అనుష్క ఖండిస్తూనే ఉన్నప్పటికీ ఆ వార్తలకు మాత్రం ఫుల్స్టాప్ పడటం లేదు. దీంతోపాటు 'భాగమతి' తర్వాత అనుష్క తదుపరి చిత్రాల స్క్రిప్ట్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీంతో చాలా స్క్రిప్ట్స్ని రిజెక్ట్ చేస్తుండటంతో సినిమా సినిమాకి చాలా గ్యాప్ వస్తోంది. ఏదిఏమైనప్పటికీ అనుష్క ఈజ్ బ్యాక్ అన్న చందాన ప్రస్తుతం రెండు నోటెడ్ చిత్రాల్లో నటిస్తూ మళ్ళీ వార్తల్లో నాయికగా నిలవడం విశేషం.