Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చరిత్రలో నిలిచిపోయే పుస్తకాన్ని రచించిన కె.ధర్మారావుకి ధన్యవాదాలు. 'మా' తరపున వారికి తగిన సాయం చేస్తాం' అని 'మా' అధ్యక్షులు నరేష్ అన్నారు. ఫిల్మ్ ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్(ఫాస్) అధ్యక్షులు కె.ధర్మారావు '86 వసంతాల తెలుగు సినిమా' పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. 1932 నుంచి 2018 వరకు తెలుగు సినిమా ఎన్ సైక్లోపీడియా రచించిన ఈ పుస్తకానికి సంబంధించి 200 ప్రతులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందించారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపి మురళిమోహన్ మాట్లాడుతూ, 'ధర్మారావు ఓ మంచి ఆలోచనతో 1932 నుండి సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులను చాలా విశ్లేషంగా ఈ పుస్తకంలో తెలిపారు. ఇందులో నా పాత్ర కూడా ఉంటుందనుకుంటున్నా. ఈ పుస్తకాన్ని 'మా' సభ్యులకు బహుకరించడం చాలా గొప్ప ఆలోచన. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో ఆయన పేరు నిలుస్తుంది. 86 వసంతాల తెలుగు సినిమా చరిత్రను రాసిన ధర్మారావుని అభినందిస్తూ ఆయన ప్రస్థానం వందేండ్ల తెలుగు సినిమా చరిత్ర వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'ఈ పుస్తకాన్ని 'మా' సభ్యులందరి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తాము. ఇలాంటి పుస్తకా లకు మరింత ప్రజాదరణ అవసరం' అని నరేష్ చెప్పారు. రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ, 'ఈ పుస్తకం చాలా గొప్ప ప్రయత్నం. చాలా ఓపిక కావలి. అన్ని వివరాలు ఎంతో ఓపికతో అన్ని వివరాలు సేకరించి ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకి అందిస్తున్న ధర్మారావు కి నిజంగా నా ధన్యవాదాలు. ఆయన ఇలాంటి పుస్తకాలు మరెన్నో అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.రామారావు, రచయిత రావి కొండలరావు, డా. కే వి రమణాచారి, ఎఫ్డీసీ చైర్మెన్ రామ్మోహన్రావు, లయన్ ఏ విజరు కుమార్, శిరోమణి వంశి రామరాజు, నటి గీతాంజలి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.