Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ప్రత్యేక గీతంలో మెరవనున్నారని మరో వార్త చక్కర్లు కొట్టింది. కానీ ఇందులో అనుష్క యాంకర్గా కనిపిస్తారట. సినిమా ప్రారంభమే ఆమె ఎంట్రీతో ఉంటుందని తెలుస్తుంది. ఆమె కోణంలోనే ఈ చిత్రం సాగుతుందట. 'సైరా' కథని అనుష్క చెప్పనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేదు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుందని, దసరా కానుకగా రిలీజ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్' అనే చిత్రంలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.