Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిహెచ్ సుమన్బాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఎర్రచీర'. కారుణ్య కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న రాజేంద్రప్రసాద్, 'మహానటి' ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగోని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సుమన్బాబు మాట్లాడుతూ, 'మదర్ సెంటిమెంట్ హర్రర్ ఎలిమెంట్స్ ప్రధానాంశాలుగా యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరామ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో రెండు చిత్రాలు చేశా. తెలుగులో దర్శకుడిగా నాకిది తొలి సినిమా. 'మహానటి'ని చూసి సాయి తుషితని ఎంపిక చేశాం. ఇందులో కారుణ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'శంభోశివ శంభో' చిత్రంలోని ఆమె నటన చూసి ఈ పాత్ర కోసం ఎంపిక చేశాం. కమల్ కామరాజు, భానుశ్రీ, అజరు, ఉత్తేజ్, మహేష్ తమ పాత్రలకి న్యాయం చేశారు. అంతేకాదు, ఇందులో ఓ ప్రత్యేక పాత్రని పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై షూట్ చేయనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపనున్నాం' అని అన్నారు. 'మా తాతగారితో(రాజేంద్రప్రసాద్) 'మహానటి' సినిమాలో నటించా. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలోనూ నా పాత్ర చాలా బాగుంటుంది' అని సాయి తుషిత చెప్పారు. నటి కారుణ్య చెబుతూ, 'నన్ను నమ్మి ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు.