Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోహీరోయిన్లుగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం 'మళ్ళీ మళ్ళీ చూశా'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ, 'స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు, సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమని ఆ ప్రేమే గెలిపించు కుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమని గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమ కథే ఈ సినిమా. మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా సాగుతుంది. అన్ని వర్గాలకు ఓ కొత్త అనుభూతినిస్తుంది' అని అన్నారు. 'ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసిన వాళ్ళందరికీ ఓ మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల సమాహారమే ఈ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోని త్వరలోనే రిలీజ్ చేస్తాం. అలాగే జూన్ ప్రథమార్థంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాత కె.కోటేశ్వరరావు చెప్పారు. అన్నపూర్ణమ్మ, అజరు, మధుమణి, ప్రభాకర్, టీ.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, జయలక్ష్మి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటర్: సత్య గిడుతూరి.