Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీత'. మన్నారా చోప్రా మరో నాయికగా ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తేజ మాట్లాడుతూ, 'వేదికపై మాట్లాడాల్సిన ప్రతిసారి నా బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సినిమా ఎలా వచ్చిందని ఇటీవల బెంగళూరులో అడిగారు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. కానీ మాములుగా అందరూ 'సినిమా చాలా బాగా వచ్చింది. సూపర్గా వచ్చింద'ని చెబుతారు. కానీ అబద్ధం చెప్పలేం. అలాగనీ నిజమూ చెప్పలేం. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ తెలియదు. సినిమా తీశా. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా. 90 శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? అనేది ఆడియెన్సే చెప్పాలి. నేను సినిమా అంతా తీసేసి పరుచూసి బ్రదర్స్ను పిలిచి చూడమన్నాను. వాళ్లు చెప్పిన కరెక్షన్స్తో మళ్లీ షూట్ చేసి అంతా సరిచేశా. ఎందుకంటే నాది అంత ఇంటలిజెంట్ బ్రెయిన్ కాదు. కళ్లజోడు పెట్టుకుని ఏదో అలా కనిపిస్తా కానీ, యావరేజ్ బ్రెయిన్ నాది. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు. కొంతమందే మేధావులుంటారు. బెల్లంకొండ యాక్షన్, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ బాగా చేస్తాడు. రెగ్యులర్గా చూసే ఆ కమర్షియల్ స్టయిల్ నాకు చేతకాదు. వేరే స్టయిల్లో చూపించాను. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. హీరోయిన్ కాజల్ కూడా చాలా బాగా చేసింది. సోనూ సూద్ నేను అనుకున్నదాని కంటే బాగా చేశారు. అనూప్ పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేశాడు. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే (ప్రేక్షకులు) ఇవ్వగలరు. ఈ నెల 24న సినిమా చూసి మీరే గ్రేడింగ్ ఇవ్వండి. ఆడియెన్సే మాకు దేవుళ్లు. వాళ్ళు బాగుండాలి' అని అన్నారు. 'సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతుంటా. సినిమానే నాకు ప్రాణం. తేజ లాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్ను నేను లైఫ్లో ఇప్పటివరకు కలవలేదు. వీళ్ళని చాలా అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ఇందులో నేను రఘురామ్ అనే సవాల్తో కూడిన పాత్ర చేశా. నా పాత్రని చూసి సర్ప్రైజ్ అవుతారు. ఇది నాకు నటుడిగా ఓ గౌరవాన్ని తెస్తుందని నమ్ముతున్నా. హీరో అంటే ఫస్ట్ కనిపించాలి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫైట్లు చెసెయ్యాలని అనుకునేవాణ్ని. కానీ తేజతో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్గా చూపించలేదు. అలాంటి కథతో చేసిన చిత్రమిది. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంది' అని హీరో బెల్లంకొండ చెప్పారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, 'ఫస్ట్ టైమ్ నేను నర్వస్ ఫీలవుతున్నా. ఇదొక బ్రిలియంట్ జర్నీ. సోనూసూద్ వండర్ఫుల్ కోస్టార్. తేజ నా గురువు, మెంటర్, గైడ్. ఆయన లేకపోతే నేను ఈ స్టేజీపై ఉండేదాన్ని కాదు. తేజ స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నాను. సీత సినిమాతో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణ పడి ఉంటా' అని తెలిపింది. 'తెలుగు నా ఫేవరేట్ ఇండిస్టీ. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది తెలుగు లాంగ్వేజే. ఇక్కడున్న టెక్నీషియన్స్ ఎంతో ప్రేమగా చూస్తారు. నా డేట్స్ ఖాళీ లేకపోయినా
నా కోసం నెలరోజులు వెయిట్ చేసి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజకి థ్యాంక్స్'
అని సోనూ సూద్ చెప్పారు.