Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు జంటగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, 'తమిళంలో 'కణ' పేరుతో విడుదలైన సినిమాని చూసి నచ్చడంతో రైట్స్ తీసుకున్నా. యూత్కి కనెక్ట్ అయ్యే కథ ఇది. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ ఈ కథకి న్యాయం చేస్తారని ఆయనకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాను. టైటిల్ తగ్గట్టే ఐశ్వర్యరాజేష్ టైలర్మేడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తమిళం, మలయాళం భాషల్లో 25 చిత్రాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె మంచి నటి. అందుకే మా బ్యానర్లో రెండు సినిమాలు చేస్తోంది. ఆమెకి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయారు. క్రికెట్ నేపథ్యంతోపాటు మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇప్పటి ట్రెండ్కి తగ్గట్లుగా దర్శకుడు భీమనేని అత్యద్భుతంగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోయిన్కి లవర్గా నటించారు. నాలుగు సాంగ్స్ ఉన్నాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ధిబు నినన్నే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలో ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ను నిర్వహించి జులై మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం' అని అన్నారు. 'ఇప్పుడు కొన్ని వందల, వేల కథలు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలు చూడాలనుకుంటున్నారు. అలాంటి ఒక మంచి కథ కోసం వెతుకుతున్న టైమ్లో తమిళంలో 'కణ' సినిమాని చూశాం. 50 సంవత్సరాలుగా 47 సినిమాలు నిర్మించి అన్ని విభాగాలపై మంచి పట్టున్న కె.ఎస్.రామారావు నిర్మాతగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా ఒక లైఫ్ని చూస్తున్నట్టు ఉంటుంది. చూశాక హాంట్ చేసే చిత్రమవుతుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, క్రికెటర్ అవ్వాలనుకునే ఒక మహిళ తన ప్రయాణంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని అంతర్జాతీయ క్రికెటర్ స్థాయికి ఎలా ఎదిగిందనేది చిత్ర కథాంశం. తండ్రి, కూతుళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రతి ఒక్కర్నీ ఆట్టుకుంటాయి' అని చెప్పారు.