Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత క్రేజ్ ఉన్న కథానాయికగా గుర్తింపు పొందింది. 'ఛలో', 'గీత గోవిందం', 'దేవదాస్' వంటి వరుస విజయాలు ఆమెకి మరింత క్రేజ్తోపాటు మరిన్ని అవకాశాల్ని తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్ట్ల్లో నటిస్తున్న రష్మిక తాజాగా తమిళ హీరో విజయ్ సరసన నటించే బంపర్ ఆఫర్ని అందుకున్నారట. విజరు ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.'థెరి', 'మెర్సల్' వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత 'మానగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు విజరు ఇటీవలే గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఇందులో కథానాయికగా రష్మికని ఫైనల్ చేశారట. నిజానికి అట్లీ దర్శకత్వంలోనే రష్మికని కథానాయికగా అనుకున్నారట.
కానీ ఆ స్థానంలోకి నయనతార వచ్చింది. అప్పుడు మిస్ అయినా, ఇప్పుడు మిస్ కాకుండా ఈ ఆఫర్ రష్మికకి దక్కడం విశేషం. దీంతోపాటు కార్తీ సరసన ఓ సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'డియర్ కామ్రేడ్', 'భీష్మ' నటిస్తూ బిజీగా ఉంది. అలాగే అల్లు అర్జున్, సుకుమార్, మహేష్బాబు,
అనిల్ రావిపూడి సినిమాల్లోనూ నటించనుంది.