Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రానికి తాజాగా 'రణరంగం' అనే టైటిల్ని ఖరారు చేశారు. శనివారం టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'టాలీవుడ్లో ప్రతిభావంతులైన యువ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆయన ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రని పోషిస్తున్నారు. ఆయన నటించిన గత చిత్రాలకు భిన్నంగా, ఎంతో వైవిధ్యంగా, ఎమోషన్స్తో కూడి ఉంటుంది. గ్యాంగ్ స్టర్ జీవితంలో 1990 నుంచి 2000 మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రం సాగుతుంది. గ్యాంగ్స్టర్గా శర్వానంద్ ఒదిగిపోయారు. దర్శకుడు సుధీర్వర్మ చిత్రాలు ఒక ప్రత్యేకతని కలిగి ఉంటాయి. ఈసినిమా కూడా అలాంటిదే. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ సినిమా సొంతం. సినిమా ఔట్పుట్పై నమ్మకంగా ఉన్నాం. ఆడియెన్స్ కూడా ఈ నయా గ్యాంగ్స్టర్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. విడుదల చేసిన ఫస్ట్లుక్, వీడియో అభిమానులను అలరిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఆగస్ట్ 2న విడుదల చేస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: ప్రశాంత్ పిళ్ళై.