Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవా, షాలినీపాండే జంటగా డాన్ శాండీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గొరిల్లా'. గంగా ఎంటర్టైన్మైంట్స్, ఆల్ ఇన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రానికి సంతోషి సమర్పకురాలు. గంగా శబరీష్ రెడ్డి నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత శబరీష్ రెడ్డి మాట్లాడుతూ,'బ్యాంక్ని కొల్లగొట్టడానికి ఓ బృందం చేసిన ప్రయత్నానికి గొరిల్లా చేసిన సాయం ఏంటి?, అసలు ఆ బృందం ఆ పనిలో నిమగం కావడానికి కారణాలు ఏంటి? అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. భారతీయ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. కాంగ్ అనే గొరిల్లాను థారుల్యాండ్ నుంచి ఈ సినిమా కోసం తీసుకున్నాం. థారుల్యాండ్లోని సామూట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన గొరిల్లా ఇది. పలు హాలీవుడ్ చిత్రాల కోసం చింపాంజీలకు, గొరిల్లాలకు ఈ సంస్థలో శిక్షణ ఇస్తుంటారు. గొరిల్లాకి సంబంధించిన మేజర్ పోర్షన్ను థారుల్యాండ్లోనే చిత్రీకరించాం. మిగిలిన సన్నివేశాలను ఇండియాలో షూట్ చేశాం. ప్రతి ఫ్రేమూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఓ పక్క ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తూనే మరో పక్క కడుపుబ్బ నవ్విస్తుంది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ను, పాటలను విడుదల చేస్తాం. అలాగే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ 21న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.