Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మహర్షి'. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. ఆ విశేషాలను చిత్ర బృందం ప్రకటించింది. 'సూపర్ స్టార్ మహేష్బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఎపిక్ బ్లాక్బస్టర్గా నిలిచింది. 19 రోజుల్లో ఇది రూ.175కోట్లు క్రాస్ చేసి రూ.200కోట్లకు పరుగులు తీస్తోంది. యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. మహేష్బాబు ట్రెమండస్ నటన, వంశీపైడిపల్లి ఎక్స్లెంట్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నిర్మాణ విలువలు ఈ సినిమాని బ్లాక్బస్టర్గా నిలిపాయి. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్ చేసింది. ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. అందుకు చాలా ఆనందంగా ఉంది' అని తెలిపింది.