Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ హీరోగా సంతోష్ కుమార్ దర్శకత్వంలో సంజన ప్రొడక్షన్స్, సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకాలపై పి.జగన్ మోహన్రావు, డి.ఎస్.రావు సంయుక్తంగా ఓ నూతన చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సిమ్రత్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ, 'ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డవారు కాదు, ఎవరూ మంచివారు కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచి వాళ్లుగా, చెడ్డవాళ్ళుగా మారతారనే సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో సుమంత్ని ఓ కొత్త కోణంలో, సరికొత్త గెటప్లో చూపించనున్నాం' అని అన్నారు. 'యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్ళనున్నాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని నిర్మాతలు తెలిపారు.