Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజరు ప్రధాన పాత్రధారిగా వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మిస్తున్న చిత్రం 'స్పెషల్'. భూమిక కీలక పాత్ర పోషించారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ, 'మా సినిమాకు అజరు మెయిన్ పిల్లర్. ఒక సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. 'గజిని', 'పిజ్జా', 'సెవెన్త్ సెన్స్', 'కాంచన', 'అపరిచితుడు', హాలీవుడ్లో వచ్చిన 'సిక్స్త్ సెన్స్', 'మెకనిస్ట్', 'సైకో' వంటి చిత్రాలను తలపించేలా వాటి స్టాండర్స్లో రూపొందించాం. స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే చిత్రమవుతుంది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా. ఇందులో సోషల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఎలిమెంట్ ఉంది. భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. అది బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవలే స్పెషల్ ప్రీమియర్ షోస్ వేశాం. వీటికి అద్భుతమైన స్పందన వచ్చింది' అని అన్నారు.
'ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది ఇదొక అద్భుతమైన సినిమా అని, ఇంతటి ఆశ్చర్యం కలిగించే సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యిందంటున్నారు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ని రీడ్ చేయడం చాలా అద్భుతంగా ఉందని, పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజరు నటన అత్యద్భుతంగా ఉందంటున్నారు. ఇది తెలుగులో చాలా ఏండ్లపాటు గుర్తుండిపోయే చిత్రమవుతుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు సినిమా పంపిణీ బాధ్యతలు తీసుకోవడం హ్యాపీగా ఉంది. చిన్న బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయగలగడం డైరెక్టర్ వాస్తవ్ ప్రతిభకు నిదర్శనం' అని నిర్మాత చెప్పారు. బాపినీడు మాట్లాడుతూ, 'ఈ సినిమాని జూన్ 14న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. 'క్షణం', 'గూఢచారి' సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది' అని అన్నారు.