Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఖైదీ నంబర్ 150'తో రీఎంట్రీ తర్వాత కొత్త సినిమాల విషయంలో చిరంజీవి స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చారట. అయితే కొరటాల దర్శకత్వంలో రూపొందే సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేశారట. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశం, వాణిజ్య విలువల మేళవింపుగా ఈ చిత్రం ఉండబోతుందట. ఇదిలా ఉంటే, ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అందుకనుగుణంగానే ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని, ఓ హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు, మరో నాయిక కోసం నయనతార, తమన్నా, అనుష్క వంటి పేర్లను పరిశీలిస్తున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. భారీ బడ్జెట్తో రామ్చరణ్ నిర్మించే ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారట.