Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగ, అక్షత జంటగా శ్రీవాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందన్ శ్రీవాస్తవ్ నిర్మిస్తున్న చిత్రం 'స్పెషల్'. అజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ,'సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రమిది. చాలా స్ట్రాంగ్ పాయింట్తో రూపొందించాం. సినిమా చూసిన వాళ్ళు ప్రశంసించారు. ఇలాంటి క్లిష్టమైన సినిమాని తక్కువ బడ్జెట్లో చేయడం చాలా కష్టం. రాబోతున్న కొత్త తరానికి, చిన్న సినిమాలు చేసేవారికి ఇదొక రిఫరెన్స్గా నిలుస్తుంది. క్రౌడ్ ఫండింగ్తో సినిమాని రూపొందించాం. నటుడు అజయ్ నటన హైలైట్గా నిలుస్తుంది. ఆయన సినిమాకి బ్యాక్బోన్లా నిలిచారు. ఇందులో చాలా మంది మంచి ప్రతిభ కలిగిన సీనియర్ ఆర్టిస్టులున్నారు. మంచి సందేశాత్మకంగా తెరకెక్కించాం. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ బట్ సూపర్బ్. చాలా కొత్తగా ఉంటుంది. ఈ నెల జూన్ 14న సినిమాని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'మైండ్ రీడర్ స్టోరీ. ఒరిజినల్ కంటెంట్తో చేశాం. క్రౌడ్ ఫండింగ్లో వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్లు అయ్యాయి. కానీ క్రౌడ్ ఫండింగ్తో చేసి విజయం సాధించిన తొలి సినిమాగా 'స్పెషల్' నిలుస్తుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని హీరో రంగ తెలిపారు. నటుడు అశోక్ కుమార్ చెబుతూ, 'ఇందులో నేను సైకియాట్రిస్ట్గా నటించాను. చాలా మంచి పాత్ర. ఇది సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా అవుతుంది. దీన్ని ఓ పెద్ద సినిమాలా ప్రోత్సహించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.
'సినిమా కథ విషయంలో దర్శకుడు చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇందులో నేను చాలా ఎమోషనల్ పాత్ర పోషించా. కచ్చితంగా ఇదొక ఊపు ఊపే సినిమా అవుతుంది' అని మరో నటుడు చక్రపాణి తెలిపారు. 'ఇది జబర్దస్త్ లాంటి సినిమా అవుతుంది' అని అప్పారావు చెప్పారు.