Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత అక్కినేని, నాగశౌర్య ప్రధాన పాత్రధారులుగా నందినీరెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' చిత్రం రూపొందుతుంది. లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాని బాలీవుడ్లో తెరకెక్కించడానికి ప్లాన్ జరుగుతుంది. 'నిర్మాత డి.సురేష్బాబు, బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్తోపాటు, భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. హిందీ వెర్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని చిత్ర బృందం తెలిపింది. ఇక తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 5న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్కి ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది.