Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న నయా చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. రంజాన్ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈచిత్రానికి సంబంధించి రెండో షెడ్యూల్ని ప్రారంభించారు. 'గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హైదరాబాద్లో ప్రారంభమైన తాజా షెడ్యూల్లో పూజా హెగ్డే కూడా పాల్గొననుంది. 'దువ్వాడ జగన్నాథం' తర్వాత బన్నీ, పూజా నటిస్తున్న రెండవ చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రమిది' అని చిత్రబృందం తెలిపింది.