Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతుంది. దాదాపు రెండు వారాలుగా అక్కడ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ఆర్మీ బ్యాక్డ్రాప్లో దాదాపు 250మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా పలు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. ఈ నెల 13 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందని, అనంతరం హైదరాబాద్లో చిత్రీకరిస్తారని తెలుస్తుంది. హైదరాబాద్ షెడ్యూల్తో ప్రధాన భాగం పూర్తవుతుందట. ఈ సినిమాలో వెంకీ రైతుగా, నాగచైతన్య సైనికుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందే ఈ సినిమాని సురేష్బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీ గతంలో చైతూ నటించిన 'ప్రేమమ్' సినిమాలో కాసేపు మెరిసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే వెంకీ తదుపరి సినిమాలకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయను న్నారని వినిపించింది. తాజాగా ఆయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారట. ఈ విషయాన్ని నిర్మాత సురేష్బాబు కన్ఫమ్ చేసినట్టు తెలుస్తుంది. వెంకీ నెక్ట్స్ సినిమా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందట. త్వరలోనే దీన్ని ప్రారంభించ
నున్నట్టు సమాచారం.