Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్ కృష్ణ, హరిణి రెడ్డి హీరోహీరోయిన్లుగా, సి.హెచ్.రవి కిషోర్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' చిత్రం రూపొందుతుంది. మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మిస్తున్నారు. 'మళ్ళీ మొదలవుతుంది రచ్చ' అనేది చిత్ర ట్యాగ్లైన్. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పిస్తున్నారు. నేడు(శనివారం) హీరో మోహన్కృష్ణ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్లుక్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ, 'సినిమా 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాం. ఇప్పటివరకు చేసిన అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఆరు పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి సినిమాని తీసుకొస్తాం' అని అన్నారు. 'మా చిత్ర హీరో మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాం. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకోవడం మాపై మరింత బాధ్యత పెంచింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాని రూపొందిస్తున్నాం' అని చిత్ర నిర్మాత సింగులూరి మోహన్ రావు చెప్పారు. హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ, 'నా పుట్టిన రోజు సందర్భంగా 'గ్యాంగ్ లీడర్' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది, నా అభిమాన హీరో అయిన చిరంజీవిగారి పుట్టిన రోజు ఆగస్ట్ 22న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.