Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన మంచి లవ్ ఎంటర్టైనర్ 'ఇష్క్ ఈజ్ రిస్క్'' అని అంటున్నారు నిర్మాత ఎస్.చంద్రశేఖర్. రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి హీరోహీరోయిన్లుగా రాజ్ కింగ్ దర్శకత్వంలో జేఎస్ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో, శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్.చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం 'ఇష్క్ ఈజ్ రిస్క్'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్ కింగ్ మాట్లాడుతూ, 'దర్శకుడిగా నాకిది రెండో చిత్రం. దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతకి థ్యాంక్స్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మాదాపూర్లోని డీజీపీ గెస్ట్ హౌస్లో ప్రారంభమైంది. ప్రస్తుతం మణికొండలోని మన స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆద్యంతం వినోదభరితంగా సినిమాని తీర్చిదిద్దుతున్నాం' అని అన్నారు. 'సినిమాకి మంచి టీమ్ కుదిరింది. క్వాలిటీగా తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని నిర్మాత తెలిపారు. జీవా, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, నల్లవేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: విజయకృష్ణ, కెమెరా: జగన్, మ్యూజిక్: డేవిడ్.