Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'భారత్'తో మంచి విజయాన్ని అందుకున్న కత్రినాకైఫ్ పరుగుల రాణి పి.టి.ఉష బయోపిక్లో నటించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. దీని ప్రభావం టాలీవుడ్పై కూడా పడింది. దీంతో తెలుగులోనూ పలు బయోపిక్ల నిర్మాణం ఏకధాటిగా జరుగుతోంది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు బాగా ఉపయోగపడే ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితంగా ఆధారంగా 'మల్లేశం'
పేరుతో ఓ బయోపిక్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో ఈ ఏడాది కూడా పలు బయోపిక్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. ఇదిలా ఉంటే, పరుగుల రాణిగా మంచి గుర్తింపు పొందిన పి.టి.ఉష జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందబోతోందని, ఇందులో పి.టి.ఉషగా నటించేందుకు కత్రినా గ్రీన్సిగల్ ఇచ్చిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై మీడియాతో కత్రినా మాట్లాడుతూ,'ఈ ప్రాజెక్ట్కి నేను సైన్ చేసేంతవరకు మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను నటించేందుకు కథ సరైనదేనని అనిపిస్తే కచ్చితంగా నటిస్తాను. ఇప్పటికే 'మేరీకోమ్', 'ఎం.ఎస్.థోని', 'దంగల్' వంటి స్పోర్ట్స్ ప్రధాన బయోపిక్లు విశేష ఆదరణ పొందాయి. ఇలాంటి వాటిల్లో నటించాలని నాకూ ఉంది' అని తెలిపింది.