Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. 'చలనమే చిత్రము.. చిత్రమే చలనము' అనేది ట్యాగ్లైన్. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజరు కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి స్పందన లభించింది. క్రియేటివ్ నెరేషన్ని, ఆర్టిస్టిక్ అంశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సత్యదేవ్, నివేతా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్, ఆడియోని విడుదల చేసి ఈ నెల 28న సినిమాని రిలీజ్ చేయనున్నాం' అని తెలిపింది.