Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'ఓటర్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ, 'అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈచిత్రంపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే సార్థక్ మూవీస్ సంస్థ పోటీ పడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పదవిలో ఉన్న నాయకుడు సరిగా పని చేయకపోతే, అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు హక్కు, ఓటర్ విలువని తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా దర్శకుడు కార్తీక్ చక్కగా తెరకెక్కించాడు. మంచి సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు అందర్నీ బాగా ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్ మూవీస్ సంస్థ మా చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్, కెమెరా : రాజేష్ యాదవ్, ఎడిటింగ్ : కె.ఎల్.ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమాల.