Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తమిళంలో 'సూరారై పోట్రు' చిత్రం రూపొందుతుంది. ఇందులో కీలక పాత్రలో నటించేందుకు మోహన్బాబు గ్రీన్ సిగల్ ఇచ్చారు. నేటి(శుక్రవారం) నుంచి ఈ చిత్ర షూటింగ్లో మోహన్బాబు పాల్గొననున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'దాదాపు 44ఏండ్ల సినీ జీవితంలో హీరోగా, విలన్గా, పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా..ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయగల ఘనుడు మోహన్బాబు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఒక్కసారి మహిళా దర్శకురాలి దర్శకత్వంలో పనిచేశారు. కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాలో మోహన్బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో నటించడం విశేషం. 'సూరరై పోట్రు' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హీరో సూర్యే నిర్మాత కావడం మరో విశేషం. కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రకు మోహన్బాబు మాత్రమే యాప్ట్ అని యూనిట్ ఆయన్ని సంప్రదించగా, కథ, పాత్ర నచ్చి నటించేందుకు అంగీకరించారు. మోహన్బాబు దగ్గరికి ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం ఆయన తనయ మంచు లక్ష్మి కావడం ఇంకొక విశేషం. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో 'సాలా కదూస్', తమిళంలో 'ఇరుది సుట్రు', తెలుగులో వెంకటేష్ హీరోగా 'గురు' పేరుతో సుధా కొంగర రూపొందించిన చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే.