Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం రూపొందుతుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకాలపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేశ్ క్లాప్ నివ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా దర్శకుడు వేణు ఉడుగులకి స్క్రిప్ట్ అందించారు. 'వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవ్యమైన కథ, కథనాలతో సినిమా సాగుతుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో రానా దగ్గబాటి, సాయిపల్లవి, నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, డైరెక్టర్స్ చందు మొండేటి, అజరు భూపతి, వెంకటేశ్ మహా, సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, ఆర్ట్: నాగేంద్ర.