Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'థాయ్ లాండ్లో ప్రమాదానికి గురి కావడంతో శర్వానంద్ షోల్డర్కి, కాలుకి గాయాలయ్యాయి. వీటి శస్త్ర చికిత్స పూర్తయ్యింది. త్వరగానే కోలుకుంటారు' అని సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా||గురువా రెడ్డి అన్నారు. ఇటీవల '96' రీమేక్ చిత్రీకరణలో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో శర్వానంద్ భుజం, కాలికి గాయాలైన విషయం విదితమే. షోలర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. థాయ్ లాండ్ నుండి హైదరాబాద్ చేరుకుని, వెంటనే సన్షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గురవారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం శర్వానంద్ భుజానికి శస్త్ర చికిత్స చేశారు. మంగళవారం ఉదయం ఐసీయు నుంచి సాధారణ రూమ్కు షిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా డా|| గురవా రెడ్డి మాట్లాడుతూ, 'శర్వానంద్తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. దురదృష్ణ్టవశాతు థారులాండ్లో జరిగిన ప్రమాదంలో తన షోల్డర్ బోన్ ఫ్రాక్చరై ఐదారు ముక్కలుగా అయ్యింది. సోమవారం మా మెడికల్ టీం డా.కమలాకర్, డా.సుబ్రమణ్యం, డా.చంద్రశేఖర్, ప్లాస్టిక్ సర్జన్ డా.భవానీ ప్రసాద్, ఎనస్తటీషియా డా.గిరిధర్ సహా నా ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఆపరేషన్ సక్సెస్ను ఫుల్గా పూర్తి చేశాం. రైట్ షోల్డర్ కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. మామూలుగా కావడానికి కొంత సమయం పడుతుంది. రెండు నెలల పాటు ఫిజియోథెరపీ అందిస్తాం. అన్ని అనుకూలిస్తే త్వరలోనే మళ్ళీ ఆయన సినిమా షూటింగ్ల్లో పాల్గొంటారు' అని చెప్పారు.