Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివిశేషు, రెజీనా జంటగా నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎవరు'. వెంకట్ రామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'థ్రిల్లర్ ప్రధానంగా రూపొందిన చిత్రమిది. ఇందులో అడివిశేషు పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. 'క్షణం' వంటి సూపర్ హిట్ తర్వాత అడివిశేష్, పీవీపీ సినిమా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆద్యంతం థ్రిల్ చేసే ఈ సినిమాని ఆగస్ట్ 23న విడుదల చేస్తాం' అని తెలిపింది.