Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా కార్తీక్రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిను వీడని నీడను నేనే'. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ సంయుక్తంగా నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో చిత్ర బృందం టపాసులు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'కంటినిండా నిద్రపోయి వారం రోజులైంది. ఎంతో నమ్మి సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్ పడ్డాను. కానీ విడుదలయ్యాక చాలా మంది ఫోనులు చేసి 'చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్, లాస్ట్లో ఎమోషన్ అదిరిపోయ్యింది' అని చాలా పాజిటివ్గా చెబుతున్నారు. చాలా హ్యాపీ. తల్లిదండ్రుల ఎమోషన్ను ఇన్నాళ్లు బయటపెట్టలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఉండాలనుకున్నాం. ఆ ఎమోషన్కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శనివారం ఎమోషనల్ సాంగ్ విడుదల చేస్తాం. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి కలెక్షన్లు బాగున్నాయంటున్నారు. నాపై, మా సినిమాపై అంత నమ్మకం పెట్టి థియేటర్లకు వెళ్లినందుకు ఆడియెన్స్కి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ వచ్చాయి. థమన్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్ ఆర్ ఇరగదీశారు. ఈ సక్సెస్ను ఆడియెన్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి రెండు రోజుల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నా' అని అన్నారు. 'ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూల్లో బాగుందని రాశారు. నా తొలి తెలుగు సినిమాకి ఇంత స్పందన రావడం హ్యాపీగా ఉంది. సందీప్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. మా టీమ్ అందరికీ థ్యాంక్స్' అని అన్యాసింగ్ చెప్పారు. నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ, 'మా బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్ సినిమా వచ్చింది. నిన్నంతా ఫుల్ టెన్షన్. మార్నింగ్ షో రెస్పాన్స్ చూశాక టెన్షన్ తీరింది. మౌత్ టాక్ బాగుంది. షోలు అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. షోలు పెంచమని అడుగుతున్నారు. సోమవారం సక్సెస్ టూర్కు వెళతాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శివ చెర్రి, సీతారామ్ పాల్గొన్నారు.