Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణసాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎం.వినరుబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సుందరాంగుడు'. ఎం.ఎస్.కె.ప్రమీద శ్రీ ఫిలింస్ పతాకంపై బీసు చందర్గౌడ్ నిర్మిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్లోని ఫిలింనగర్లో చివరి షెడ్యూల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఎం.వినరుబాబు మాట్లాడుతూ, 'జమీందార్ కుటుంబంలో పుట్టిన హీరో అందంగా లేకపోయినప్పటికీ అతని డబ్బు కోసం అమ్మాయిలందరూ ప్రేమిస్తున్నామని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో హీరో
ఓ సాధారణ యువకుడిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతన్ని చూసి అమ్మాయిలందరూ అసహ్యించుకుంటారు. అలా అసహ్యించుకున్న అమ్మాయిలను అతనెలా వశపర్చుకున్నాడు?, చివరకు తనని ఎంతగానో ఇష్టపడే మరదలి ప్రేమను అంగీకరించాడా లేదా అనేదే ఈ సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. త్వరలో దుబారులో చేయబోయే పాటతో షూటింగ్ పూర్తవుతుంది. సిద్ధబాపు ఐదు అద్భుతమైన పాటలను అందించారు' అని చెప్పారు. 'సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశారు. అనుకున్న దాని కంటే సినిమా చాలా బాగా వస్తోంది' అని నిర్మాత అన్నారు. 'ఓ వినూత్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు వినరు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నా క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేశారు' అని కథానాయకుడు కృష్ణసాయి చెప్పారు.