Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేషు, రెజీనా జంటగా వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా 'ఎవరు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా చిత్ర యూనిట్ చెబుతూ, ''క్షణం', 'అమీతుమీ', 'గూఢచారి' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేషు హీరోగా రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఇండిపెండెంట్ డే గిఫ్ట్గా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నాం. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్లుక్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'క్షణం' వంటి సూపర్ హిట్ తర్వాత అడివి శేషు, పీవీపీ సినిమా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది' అని తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, ఆర్ట్: అవినాష్, ఎడిటింగ్: గ్యారీ బిహెచ్.