Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'టాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో శర్వానంద్ ఒకరు. ఆయన ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్గా కనిపించ బోతున్నారు. ఇది ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగాను, ఎమోషనల్గానూ ఉంటుంది. హీరో జీవితంలో 1990, 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అద్భుతమైన కథ, కథనాలు, భిన్నమైన భావోద్వేగాలు ఈ సినిమా సొంతం. గ్యాంగ్స్టర్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయి చక్కని ప్రతిభ కనబరిచారు. సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు కూడా ఈ నయా గ్యాంగ్స్టర్ని చూసి ఆదరిస్తారని నమ్మతున్నాం. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దర్శకుడు సుధీర్ వర్మ సినిమాని తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న సినిమాని విడుదల చేయనున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై, కెమెరామెన్ :దివాకర్ మణి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రవీందర్.