Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ ఇరవై ఏండ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. మధురానుభూతినిచ్చిన ఈ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నా' అని నటి, గాయని స్మిత చెప్పారు. గాయనీగా కెరీర్ ప్రారంభించి
స్మిత 20ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా త్వరలో ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆ విశేషాలను మంగళవారం ఆమె మీడియాకి తెలిపారు. 'నాకు ఏమీ తెలియని, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చిత్ర రంగానికి వచ్చాను. నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా నేను ఎంజారు చేసాను. 1996లో 'పాడతా తీయగా'లో తొలిసారి మైక్ పట్టుకున్న క్షణం నుంచి నిన్నమొన్నటి వరకు కూడా అదే ఉత్సాహం, ఎంజారుమెంట్ నాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండిపాప్ నేనే అయినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. 10 కంటే ఎక్కువ భాషల్లో పాడటం గొప్ప అనుభవం. వీటన్నింటితోపాటు 12 ఆల్బమ్స్, 17 మ్యూజికల్ వీడియోలు, 100కు పైగా ప్లే బ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్సర్ట్స్.. ఓ ట్రోఫీని ఇంటికి తీసుకురావడం ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని తీపి అనుభూతులే. నా మ్యూజిక్ అండ్ డాన్స్ జర్నీకి సంబంధించిన ఓ సెలబ్రేషన్ ఈ నెల 22న చేయబోతున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయిన ప్రతీ ఒక్కర్ని ఆ వేడుకలో గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. నా పాటలు వందల మిలియన్స్ డిజిటల్ వ్యూస్ దాటిపోయి ఎన్నో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాయి. ఈ ప్రయాణంలో అది కూడా ఎంతో మధురానుభూతినిచ్చింది. నేనింత సాధించడానికి ఎంతో చేసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పడానికి సెలబ్రేషన్ ఏర్పాటు చేశా. కళకు నేను ఇవ్వాలనుకుంటున్న గౌరవం ఇది. ఎవ్వరికి రాని అరుదైన అవకాశం నాకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా ముందున్న లక్ష్యాలను కూడా ఆ రోజు మీ ముందు ఉంచబోతున్నాను. ఈ నెల 22న సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ఈ వేడుక జరగనుంది. ప్రతి ఒక్కరు హాజరై సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.