Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'కన్నుకొట్టి' అంటూ సాగే పల్లవిగల రెండో పాటని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియజేస్తూ, ''కన్ను కొట్టి చూసేనంట సుందరి...మనసు మీటి వెళ్ళె నంట మనోహరి' అంటూ సాగే పాటని కృష్ణ చైతన్య రచించగా, కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినిలపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కథాపరంగా ఈ పాట శర్వానంద్, ప్రియదర్శినిల మధ్య ఉన్న ప్రేమకు చక్కని వెండితెర రూపం. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త దనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్ర ఆడియో రిలీజ్ అవుతుంది. సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశలో ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్.