Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమన్ రంగనాథన్, బెనర్జీ, డీఎస్ రావు, ముమైత్ ఖాన్, వెంకట్, సంజీవ్కుమార్ ప్రధాన పాత్రధారులుగా కె.టి. నాయక్ దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'దండుపాళ్యం 4'. పలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, 'ఓ కొత్త గ్యాంగ్తో సినిమాని రూపొందించాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కన్నడ వెర్షన్ సెన్సార్ వాళ్ళు రిజెక్ట్ చేయడంతో రివైజింగ్ కమిటీకి వెళితే కొన్ని కట్స్ చెప్పారు. దీంతో ట్రిబ్యూనల్కి వెళ్ళాం. జడ్జ్ మొదట కన్ప్యూజన్ అయినప్పటికీ సినిమా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా జస్ట్ ల్యాగ్కి మాత్రమే కట్స్ ఇచ్చి 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఫైనల్గా సినిమాని ఆగస్ట్ 15న విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. మొదటగా తెలుగు, కన్నడ భాషల్లో, కొంత గ్యాప్తో తమిళం, మలయాళ భాషల్లో, ఆ తర్వాత హిందీలో విడుదల చేస్తాం. రెగ్యులర్కి భిన్నంగా ఏదైన సినిమా చేస్తే సెన్సార్ వాళ్ళు టార్చర్ పెడుతున్నారు. సినిమాని కొనాలనుకునే డిస్ట్రిబ్యూటర్స్కి సినిమా చూపించి మరీ ఇస్తాం. ఆసక్తి ఉన్నోళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు' అని అన్నారు. 'గత చిత్రాల్లో సరైన క్లైమాక్స్ లేదనే అసంతృప్తి ఉండింది. ఇందులో ఇండియాలో ఇప్పటి వరకు రాని, ఏ సినిమాలో లేని, ఎవరూ ఊహించని క్లైమాక్స్ని పెట్టాం. అది మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గత చిత్రాలకి నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుంది' అని దర్శకుడు కె.టి.నాయక్ తెలిపారు. లక్ష్మినారాయణ చెబుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా ఎంజారు చేసేలా, చాలా కొత్తగా ఉంటుంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.