Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనుముల శివ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'నలుగురు అమ్మాయిలతో' సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. శ్రీ తిరుమల వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మంతిని మధు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఎనుముల శివ సరసన హీరోయిన్లుగా మహాలక్ష్మీ, మానస జాహ్నవి నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి హీరో,
నిర్మాత ఎనుముల శివ మాట్లాడుతూ,'రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది'
అని చెప్పారు. 'ఈ సినిమాకి హీరో లుక్స్, ఆయన నటన హైలైట్గా నిలుస్తాయి. అలాగే ముఖ్యపాత్రలో నటిస్తున్న జబర్ధస్త్ ఫేమ్ అప్పారావు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది. రొమాన్స్ బేస్డ్గా యూత్ని బాగా ఆకట్టుకునే కంటెంట్ ఇందులో ఉంది. మంచి కాన్సెప్ట్ ఉన్న కథ ఇది' అని దర్శకుడు మంతిని మధు చెప్పారు. 'ఈ సినిమా యూత్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. మంచి కథతో మేం చేస్తున్న ప్రయత్నానికి మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం' అని కథానాయిక మహాలక్ష్మి అన్నారు.