Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి మహానటి సావిత్రిగా వెండితెరపై నట విశ్వరూపం చూపించి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కీర్తిసురేష్ దక్కించుకున్న విషయం విదితమే. తెలుగులో నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ అందం, అంతకిమించి అభినయంతో ప్రేక్షకుల్ని కీర్తి విశేషంగా అలరించింది.
'నేను శైలజ', 'అజ్ఞాతవాసి', 'మహానటి' చిత్రాలతో స్టార్ స్టేటస్ని సొంతం చేసుకున్న కీర్తి ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్గా నిలవడం విశేషం. ఇప్పటికే దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో
ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తున్న కీర్తి తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈశ్వర్ కార్తీక్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'పేటా', 'జిగర్తాండ' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.