Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో మంచి విజయం సాధించిన 'ప్రస్థానం' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అదే పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాకి మాతృక దర్శకుడు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కొయిరాలా, జాకీ ష్రాఫ్, చుంకీపాండే, అలీ ఫజల్, సత్యజీత్దుబే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా శుక్రవారం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేశారు. సినిమాలో నటించే ప్రధాన తారాగణమంతా ఈ పోస్టర్లో ఉంది. మధ్యలో సంజరు దత్, ప్రారంభంలో మనీషా కొయిరాలా, చివరలో జాకీ ష్రాఫ్ ఉండగా సంజయ్ కి అటూ ఇటుగా సత్యజీత్ దుబే, అలీ ఫజల్ ఉన్నారు. దీంతోపాటు సంజయ్ దత్ సోలో ఫొటో సైతం ఆకట్టుకుంటుంది.అంతేకాదు వారసత్వం కోసం యుద్ధం అనే క్యాప్షన్ ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామాగా రామాయణం, మహాభారతంలోని పాత్రల ఆధారంగా సినిమా రూపొందుతుంది. సెప్టెంబర్ 20న సినిమా విడుదల కానుంది. దేవాకట్టా దర్శకత్వంలో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'ప్రస్థానం' 2010లో తెలుగులో మంచి విజయం సాధించింది. అలాగే రెండు నంది అవార్డులను అందుకుంది. ఇతర పురస్కారాలు వరించాయి. ఈ రీమేక్లో సాయికుమార్ నటించిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు.