Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేషు, రెజీనా, నవీన్చంద్ర ప్రధాన పాత్రధారులుగా వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పీవీపీ నిర్మించిన చిత్రం 'ఎవరు'. స్వాతంత్ర దినోత్సవ కానుకగా గురువారం విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అతిథిగా విచ్చేసిన నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, 'ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ని ప్రారంభించిన అడివిశేషు 'క్షణం'తో హీరోగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత 'గూఢచారి', ఇప్పుడు 'ఎవరు'తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మనలో ప్రతిభ ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా రాణించగలమనే దానికి శేషు ఉదాహరణ. ఇందులో ఒక్క ఫైట్ లేదు, పాటలు లేవు. కేవలం ఆడియెన్స్కి థ్రిల్ని పంచుతూ సాగింది. తెలుగు ఆడియెన్స్ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేశారు. నైజాంలో నేనే విడుదల చేశా. మంచి కలెక్షన్లని రాబడుతుంది. రెజీనా నటిగా ఎప్పుడో నిరూపించుకుంది. ఇందులో ఆమెలోని నటనని దర్శకుడు మరింతగా బయటకు తీసుకొచ్చాడనిపించింది. నవీన్ చంద్ర ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇక్కడ హీరో అనేది శాశ్వతం కాదు. కొన్నేండ్ల తర్వాత హీరో కూడా క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. రామ్ జీ సినిమాని బాగా డీల్ చేశారు. చిత్ర బృందానికి అభినందనలు. సినిమా బాగుంటే ఎన్ని వీడియోలు లీక్ అయినా ఎఫెక్ట్ కాదు. ఇలాంటి సినిమాలను మా బ్యానర్లో చేయాలనుకుంటున్నా. శేషునే దాన్ని డీల్ చేయాలి.నాకు జడ్జ్మెంట్ తెలియదు' అని అన్నారు. 'సినిమా రిజల్ట్ ఎగ్జైటింగ్గా ఉంది. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, నా చిత్ర బృందానికి థ్యాంక్స్' అని మురళీ శర్మ తెలిపారు. హీరో శేషు చెబుతూ, 'విడుదలకు సపోర్ట్ చేసిన దిల్రాజుకి థ్యాంక్స్. ఆయన నిర్మించిన 'ఎవడు' సినిమాకి, ఈ 'ఎవరు'కి ఓ సంబంధం ఉంది. 'ఎవడు'లో విలన్గా నటించాలని ఎంతో ప్రయత్నం చేశా. కానీ సెట్ కాలేదు. 'ఎవరు' సినిమా చూశాక దిల్రాజు ఫోన్ చేసి మా బ్యానర్లో సినిమా ఎప్పుడు చేస్తావన్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. 'గూఢచారి'కి మూడు రెట్ల ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమాని అన్ని విధాలుగా ఆడియెన్స్ ఎంజారు చేస్తున్నారు' అని తెలిపారు. 'ఈ విజయం టీమ్ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. సక్సెస్ని ఎంజారు చేస్తున్నాం' అని దర్శకుడు రామ్జీ తెలిపారు. రెజీనా మాట్లాడుతూ, 'అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని థియేటర్స్కి వెళ్ళి చూశాం. ఆడియెన్స్ ఎంజాయ్ చేసే తీరు నాకు బెస్ట్ ఫీలింగ్నిచ్చింది' అని తెలిపింది. నవీన్ చంద్ర మాట్లాడుతూ,'దిల్రాజు సలహా మేరకు క్యారెక్టర్స్ చేస్తున్నా. బాల్రెడ్డి నుంచి అశోక్ వరకు ప్రేక్షకులు నన్ను బాగా గుర్తిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని ట్విస్టులు, టర్న్లు బయటకి చెప్పకూడదని కోరుతున్నాం' అని అన్నారు.